ప్రజా సేవ పేరుతో కొందరు నాయకులు అక్రమ సంపాదనకు పాల్పడుతున్న ప్రస్తుత వ్యవస్థలో.. ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య నిరాడంబరత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసినా ఆయనపై ఒక్క అవినీతి మరక లేదు. తాజాగా.. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు నర్సయ్య. తన కూతురు కొనిచ్చిన కారు కారణంగా అప్పులపాలవుతున్నట్లు తెలిపారు.