50 రోజుల తర్వాత పోలీసులు సీజ్ చేసిన తన కారును విడుదల చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కోర్టు ఆదేశాలతో సీజ్ చేసిన తన కారును విడుదల చేసిన పోలీసులు.. ఆ కారును పగలగొట్టిన వారిని మాత్రం స్టేషన్లో పెట్టలేకపోయారంటూ పోలీసులపై అంబటి రాంబాబు పంచులు వేశారు. చంద్రబాబు. నారా లోకేష్ పాలన అంటే ఇలాగే ఉంటుందని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబు జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే.