తెలంగాణలోని యూనివర్సిటీల్లో 500 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ పోస్టుల భర్తీకి క్లారిటీ వచ్చే ఛాన్సుంది. ఇక జీవో 21లో ఉన్న పలు అంశాల కాంట్రాక్టు అధ్యాపకులు, నిరుద్యోగుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి వీటిపై కూడా స్పష్టత రానుంది.