కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఓఎంసీ కేసులో తన ఇంట్లో ఉన్న 53 కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారని.. ఆ నగలు తుప్పుపట్టిపోతాయని గాలి జనార్ధన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆ 53 కిలోల నగలతో పాటు రూ.5 కోట్ల విలువైన బాండ్లను తనకు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ తెలంగాణలో హైకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.