పిఠాపురంలో ఆరు నెలల చిన్నారి అనుమానాస్పద మృతి కేసు సంచలనం రేపింది. పోలీసులు విచారణలో కన్నతల్లి శైలజ, అమ్మమ్మ అన్నవరం కలిసి పాపను హత్య చేసినట్లు తేలింది. కూతుర్ని మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేయాలనే ఆలోచనతో ఉన్న అమ్మమ్మ అన్నవరం.. అడ్డుగా ఉన్న యశ్వితను కూతురి సాయంతో గొంతు నులిమి చంపి, నూతిలో పడేశారు. అనంతరం క్షుద్రపూజల ఆనవాళ్లు సృష్టించే ప్రయత్నం చేసినా, పోలీసుల విచారణలో నిజం బయటపడింది. దీంతో ఇద్దరూ కటకటాల పాలయ్యారు.