Reliance Rs 25 Crore Donation To Gudimallam Temple: ఏపీలో పురాతన ఆలయానికి ఇచ్చిన హామీ ప్రకారం రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ భారీ విరాళం అందించనున్నారు. ఇటీవల గుడిమల్లం ఆలయం గురించి తెలిసి స్పందించిన అనంత్ అంబానీ ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తామన్నారు. గుడిమల్లం ఆలయానికి రిలయన్స్ గ్రూప్ నుంచి రూ.25 కోట్లు విరాళం అందించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గిరి నాయుడు తెలిపారు.