గుంటూరులో శంకర్ విలాస్ వంతెన కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. సుమారుగా 70 ఏళ్ల పాటు ఈ వంతెన మీదుగా నగరవాసులు రాకపోకలు సాగించారు. అయితే నగరం విస్తరించడం. ట్రాఫిక్ రద్దీ కారణంగా పాత వంతెన స్థానంలో నాలుగు వరుసల ఆర్వోబీ నిర్మించనున్నారు. రూ.98 కోట్లతో ఈ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి కూల్చివేతలు ప్రారంభం కాగా.. స్థానికులు పాత వంతెనతో తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.