తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, వైఎస్ జగన్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు తనపై చూపిన అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పునరంకితమవుతానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు తనవంతు కృషి చేస్తానంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.