దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో సంబరంగా దీపావళి వేడుకలు జరుపుకున్నారు. చీకట్లను తొలగించేలా ప్రతి ఇంటా దీపాలు వెలిగించి.. టపాసులు కాల్చారు. సాధారణంగా దీపావళి పండగ అంటే దేశంలో ఎక్కడైనా ఇలానే చేసుకుంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతంలో మాత్రం ఇందుకు భిన్నంగా దీపావళి పండగ చేసుకున్నారు జనాలు. సాధారణంగా శ్మశాన వాటికకు వెళ్లాలంటేనే భయపడతారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రజలు మాత్రం దీపావళి నాడు శ్మశానవాటికకు వెళ్లి సంబరాలు చేసుకుంటారు. గత 80 ఏళ్లుగా వారు ఇలానే దీపావళి జరుపుకుంటున్నారు. ఆ వివరాలు..