తెలంగాణలో కస్టమ్ మిల్లింగ్ రైస్ వ్యవహారంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. 89 రైస్ మిల్లుల్లో సుమారు రూ.927.16 కోట్ల విలువైన 3.72 లక్షల టన్నులకు పైగా ధాన్యం లెక్కల్లో కనిపించలేదని అధికారులు అంచనా వేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 28 కేసులు నమోదు చేసి 50 మందిని నిందితులుగా చేర్చగా, 26 మంది మిల్లర్లను అరెస్టు చేశారు. సుమారు రూ.715 కోట్ల విలువైన మొత్తాన్ని రికవరీ చేసినట్లు తెలుస్తోంది.