గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఐటీసీ సంస్థ భాగస్వామి కానుందని స్వర్ణాంధ్ర పీ 4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు తెలిపారు. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 100 గ్రామాల అభివృద్ధికి ఐటీసీ సహకరించనుందని ఆయన వెల్లడించారు. మూడేళ్ల కాల పరిమితితో ఈ ప్రాజెక్టు అమలుకానుంది. కార్యక్రమాలను ప్రణాళికబద్ధంగా అమలు చేయడంతోపాటు వాటి పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించున్నారు. గ్రామీణ ప్రజల జీవనోపాధి, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.