గణేశ్ నవరాత్రుల నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు తెరతీస్తున్నారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఉపయోగించే వస్తువులు, ఆన్లైన్ విరాళాల పేరుతో ఫేక్ ప్రకటనలు ఇస్తున్నట్లు చెబుతున్నారు. మార్కెట్ ధరల కంటే భారీగా తక్కువ ధరకే వస్తువులను హోమ్ డెలివరీ చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అప్రమత్తం చేశారు. తెలియని లింకులను క్లిక్ చేయకూడదని.. మోసానికి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.