కేంద్రమంత్రి బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అఖిలేష్ యాదవ్ ఇటీవల తెలంగాణలో పర్యటించి రేవంత్ రెడ్డి, కేటీఆర్లతో వేర్వేరుగా సమావేశం కాగా.. దానిపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీకి బీ టీమ్ బీఆర్ఎస్ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెరవెనుక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటేనని పేర్కొన్నారు. బహిరంగంగా ప్రత్యర్థులు అని చెప్పుకుని.. లోలోపల మాత్రం ఆ రెండు పార్టీలు ఒకటే అంటూ ఆరోపించారు.