అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించారు. భారతదేశం మీద 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి సుంకాల విధింపు నిర్ణయం అమల్లోకి వస్తుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆంధ్రప్రదేశ్ మీద ఎంతమేరకు ప్రభావం చూపుతుందనే విశ్లే్షణలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఏపీ నుంచి అమెరికాకు రొయ్యలు ఎక్కువగా ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఏపీ ఆక్వాకల్చర్ మీద ఏ రకమైన ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.