అనకాపల్లి జిల్లా కోటరవుట్ల మండలం కైలాసపట్నంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. కైలాసపట్నంలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. మరో ఆరుగురికి గాయాలు కాగా.. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వం తరుఫున మృతుల కుటుంబాలకు రు.15 లక్షలు పరిహారంగా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తామన్నారు.