Anantapur: ఆటో, బస్సు ఢీ.. ఏడుగురు మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

6 months ago 11
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురి తీవ్రంగా గాయపడ్డారు. గాయాలైన వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఈ ప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ప్రకటించారు.
Read Entire Article