Andhra Pradesh Rains Today: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాగల మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగిలిన చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని అంచనా వేసింది.