ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాత లేఅవుట్లకు అనుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించింది. అనుమతులు లేని 870 పాత లేఅవుట్లకు అనుమతులు పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీని ద్వారా ఈ లేఅవుట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన 85 వేల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. పాత లేఅవుట్లకు వన్టైమ్ సెటిల్మెంట్ కింద అనుమతులు మంజూరు చేయనున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.