జనవరి 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖ నగరంలో పర్యటించారు. మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఏపీలో ఆయన మొదటి పర్యటన ఇదే. ఈ క్రమంలో రాష్ట్రానికి అనేక ప్రాజెక్ట్లను మోదీ ప్రకటించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో రూ.1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రో ఎనర్జీ ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో పలు సంస్థలు విశాఖలో పెట్టుబడులకు ముందుకొస్తున్నాయి. తాజాగా రిలయన్స్ సంస్థ అక్కడ పెట్టుబడులకు ముందుకొచ్చింది.