ఏపీలో రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగస్ట్ రెండో తేదీన ప్రకాశం జిల్లాలో పర్యటించారు. ప్రకాశం జిల్లా పర్యటనలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ పథకం తొలివిడత నిధులను రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు. మొత్తం రూ.3,156 కోట్ల రూపాయలను తొలివిడత సాయం కింద రైతుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నట్లు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు.