Annamalai: తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఇటీవల తప్పుకున్న కే అన్నామలై.. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానం నుంచి అన్నామలై పెద్దల సభకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు.. కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.