తెలంగాణలో నేటి నుంచి నాలుగు సంక్షేమ పథకాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు నారాయణపేట జిల్లా చంద్రవంచ గ్రామం నుంచి ఈ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. తన సోదరుడు తిరుపతి రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటంపై వస్తున్న విమర్శలపై స్పందించారు. తన అన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటే తప్పేంటీ అని అడగటమే కాదు.. బాజాప్తా పాల్గొంటాడు అని సందేశం ఇచ్చారు రేవంత్ రెడ్డి.