AP 10th Class Exams: పదో తరగతి పరీక్షల చెకింగ్‌కు వెళ్లిన అధికారి.. ఎగ్జామ్ సెంటర్లో కాటేసిన పాము..

1 year ago 14
పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో పదో తరగతి పరీక్షల అధికారి పాము కాటుకు గురయ్యాడు. కోమటినేనివారిపాలెం హెడ్మాస్టర్ గా పని చేస్తున్న కరీముల్లా అనే వ్యక్తి.. చిలకలూరిపేటలోని ఓ పాఠశాలకు 10 వ తరగతి పరీక్షల చీఫ్ సూపరిటెండెంట్‌గా విజిటింగ్‌కు వెళ్లారు. పరీక్ష హాలులో హాల్ టికెట్ నంబర్లు సరిచూస్తున్న సమయంలో పరీక్షా హాలులోనే కరీముల్లాను పాము కాటేసింది. దీంతో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
Read Entire Article