ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన చిన్న, సన్నకారు రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించే ఒక పెన్షన్ పథకం. 18-40 ఏళ్ల మధ్య వయస్సు గల రైతులు స్వల్ప ప్రీమియం చెల్లించడం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ. 3,000 పింఛను పొందవచ్చు. పీఎం కిసాన్ లబ్ధిదారులు సీఎస్సీల ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పీఎం కిసాన్ లబ్ధిదారు కాకపోతే.. నేరుగా సీఎస్సీలో దరఖాస్తు చేసుకుని మీ పింఛను కార్డును పొందవచ్చు.