Andhra Pradesh Assembly Budget 2025 Live: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. దాదాపు 3 లక్షల 24 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెడుతోంది. సరిగ్గా ఉదయం 10 గంటల తర్వాత ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెడతారు. కొల్లు రవీంద్ర శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మున్సిపల్శాఖ మంత్రి నారాయణ సమర్పిస్తారు.