ఏలూరు జిల్లాలో వింత దొంగతనం జరిగింది. ద్వారకా తిరుమలలో ఇంటి ఆవరణలో ఉంచిన గ్యాస్ సిలిండర్ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. రాత్రి పూట ఈ ఘటన జరిగింది. ఇంట్లోని వ్యక్తులు పనిమీద బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి కాంపౌండ్ లోపల ఉంచిన గ్యాస్ సిలిండర్ చోరీ జరిగింది. మరోవైపు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత కలవరపెడుతున్న నేపథ్యంలో.. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడు ఏపీలోనూ గ్యాస్ సిలిండర్ల దొంగతనం జరిగింది.