Andhra Pradesh Budget Talliki Vandanam Scheme Allocations: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో 2025-26కు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్లో విద్యార్థులకు సంబంధించిన తల్లికి వందనం పథకంపై క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన హామీ అమలు దిశగా కేటాయింపులు చేశారు.. తల్లికి వందనం పథకం కోసం బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.