ఏపీ పోలీసులకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్లో గుడ్ న్యూస్ వినిపించారు. పోలీస్ సిబ్బందికి గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం కింద కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకూ ఉచిత బీమా కవరేజీ అందించనున్నారు. మరోవైపు బడ్జెట్ ప్రసంగంలో పోలీసులకు కొత్త వాహనాలు, టీఏ, డీఏ బకాయిల చెల్లింపులు వంటి విషయాలపైనా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్పష్టత ఇచ్చారు. పోలీసుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు.