AP Cabinet Decisions: భూమి కబ్జా చేస్తే 10 ఏళ్లు శిక్ష.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

1 year ago 31
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగింది. ఈ కేబినెట్ భేటీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లు, డ్రోన్ పాలసీ, ఏపీ జీఎస్టీ చట్ట సవరణ సహా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, కబ్జాలను అరికట్టడానికి ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లును ఏపీ ప్రభుత్వం తీసుకువస్తోంది. గతంలో ఉన్న చట్టాన్ని రిపీల్ చేసిన ప్రభుత్వం.. కఠినమైన శిక్షలతో నూతన చట్టం తీసుకురానుంది.
Read Entire Article