సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుమారుగా నాలుగు గంటలపాటు జరిగిన ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వరద సాయం ప్యాకేజీకి సైతం పచ్చజెండా ఊపింది. ఇక భోగాపురం విమానాశ్రయం పేరును అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా మార్చారు. వీటితో పాటుగా కౌలు రైతులకు పంట నష్టపరిహారం, వాలంటీర్ వ్యవస్థపైనా చర్చ జరిగింది.