తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేసిన అభిషేక్ మనూ సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. పోటీలో మరెవరూ లేకపోవటంతో ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈ మేరకు వారికి నియామకపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.