భవిష్యత్తులో రాబోయే 25 ఏళ్ల సవాళ్లను ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీసు శాఖ 'ఫ్యూచర్ రెడీ' కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏఐ టెక్నాలజీ వినియోగం, సైబర్ క్రైమ్ నియంత్రణ, ఐసీసీసీ (ICCC) అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోలీస్ వ్యవస్థలో సంస్కరణల కోసం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని, నిధులకు కొరత లేదని స్పష్టం చేశారు.