Andhra Pradesh Cabinet Decisions: రాఖీ పౌర్ణమి వేళ రాష్ట్రంలోని మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూ్స్ చెప్పింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించింది. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలు చేయాలనే ప్రతిపాదనలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో గ్రీన్ సిగ్నల్ వచ్చింది. స్త్రీ శక్తి పేరుతో ఈ పథకం అమలు చేయనున్నారు. ఆగస్ట్ 9న సీఎం చంద్రబాబు దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలిసింది.