94 Years Woman Applied For Indian Citizenship In Bapatla: భారత పౌరసత్వం కోరుతూ 94 ఏళ్ల మహిళ మహాలక్ష్మమ్మ దరఖాస్తు చేసుకున్నారు. బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం చింతగుంపలకు చెందిన మహాలలక్ష్మమ్మ జిల్లా కలెక్టర్ వి.వినోద్ కుమార్ను కలిశారు. భారత పౌరసత్వం కోసం ఆమెతో కలెక్టర్ ప్రమాణం చేయించారు. ఆమె అమెరికా పౌరసత్వం వదులుకుని సొంత ఊరిలో ఉంటున్నారు. ఇక్కడే చనిపోవాలని.. తన అంత్యక్రియలు స్వగ్రామంలోనే జరగాలనే చివరి కోరిక ఉందంటున్నారు.