Andhra Pradesh Travels Buses Quarterly t Tax Reduced: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ట్రావెల్స్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా.. పన్నుల తగ్గింపునకు కేబినెట్ ఓకే చెప్పింది. బస్సులకు ప్రతి సీటుపై విధించే త్రైమాసిక పన్నును రూ. 4,000 నుంచి రూ. 2,500కు తగ్గిస్తూ ఏపీ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి బస్సుపై రూ.2 లక్షలు ఆదా అవుతుందని బస్సుల ఆపరేటర్లు చెబుతున్నారు.