సోమవారం ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి. విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు, జిల్లాల పునర్వవస్థీకరణ, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై మంత్రిమండలి చర్చించనున్నారు. అలాగే పలు సంస్థలకు భూముల కేటాయింపులపైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.