ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం బుధవారం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ అవుతుంది. అమరావతి నిర్మాణం, జీఏడీ టవర్లు, హెచ్వోడీ టవర్ల టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశంఉంది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15000 వేసే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే జూన్ 5న కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై చర్చించనున్నట్లు సమాచారం.