ఏపీ ఫైబర్నెట్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. ఎండీ దినేష్ కుమార్ మీద ఆయన సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం నడుస్తూ ఉండగానే జీవీ రెడ్డి ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవితో పాటుగా టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అలాగే ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ను బదిలీ చేసింది.