ఆచార్య జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో విద్యార్థుల దీక్ష ఫలించింది. పీజీ విద్యార్థుల స్టైపెండ్ను రూ.5 వేల నుంచి రూ.12 వేలకు, పీహెచ్డీ స్కాలర్లకు రూ.7 వేల నుండి రూ.15 వేలకు పెంచుతూ వీసీ అల్దాస్ జానయ్య హామీ ఇచ్చారు. ఈ నెల 16న విద్యార్థుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. ప్రభుత్వం, వర్సిటీ యాజమాన్యం సానుకూలంగా స్పందించడంతో విద్యార్థులు తమ నిరవధిక దీక్షను విరమించారు.