పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి గ్యాస్ కొరత నెలకొన్న నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో డొమెస్టిక్ గ్యాస్ కొరత రాకుండా ఉండాలని మంత్రుల సబ్ కమిటీని ఆదేశించారు. కేంద్రంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ.. ప్రజలకు వంట గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.