Free bus Travel Scheme in Andhra Pradesh: ఆగస్ట్ 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో పథకాన్ని విజయవంతంగా అమలుచేసేందుకు ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలోని 74 శాతం బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో మహిళలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన గుర్తింపు కార్డుల సాయంతో ఐదు రకాల బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చు. మరోవైపు ఉచిత బస్సు పథకం పేరు ఏమిటనే దానిపై సస్పెన్స్ వీడింది. సీఎం చంద్రబాబు స్వయంగా ఈ పేరు చెప్పేశారు..