ఏపీవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమల్లోకి వచ్చింది. ఆగస్ట్ 15వ తేదీ సాయంత్రం నుంచి స్త్రీ శక్తి పథకం అమలవుతోంది. ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డులు చూపించి ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఉచిత బస్సు పథకానికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అవుతోంది. ఫ్రీ బస్ అయినప్పటికీ బస్ ఎక్కే అవకాశం కూడా ఇవ్వడం లేదంటూ పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిపై ఏపీ ఫ్యాక్ట్ చెకింగ్ విభాగం స్పందించింది.