APSRTC NMUA Workers calls for dharna: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభానికి అడుగులు చక చకా పడుతున్నాయి. ఆగస్ట్ 15 నుంచి ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించునున్నారు. ఇందుకోసం ఆర్టీసీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఏ బస్సుల కండీషన్ ఎలా ఉందనే దానిపై సమీక్షలు, కసరత్తులు జరుపుతున్నారు. అయితే ఆగస్ట్ 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలు కానుండగా.. అందుకు మూడు రోజుల ముందు ఆర్టీసీ కార్మికులు ధర్నాకు పిలుపునివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.