AP High Court Judge Gedela Tuhin Kumar: ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో కొత్త జడ్జిని నియమించారు. తుహిన్ కుమార్ గేదెలను హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలపగా, కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది. తాజాగా తుహిన్ కుమార్ నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్గా ఉన్న తుహిన్ కుమార్ త్వరలో అదనపు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.