ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) శనివారం అరెస్ట్ చేసింది. వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు.. విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు.. వాసుదేవరెడ్డికి ఫిబ్రవరి 27వ తేదీ వరకూ రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వాసుదేవరెడ్డిని గుంటూరు జైలుకు తరలించారు.