ఏపీలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. మొత్తం 26 జిల్లాల్లోనూ మద్యం దుకాణాల కేటాయింపు విజయవంతంగా ముగిసిందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు లిక్కర్ షాపుల లాటరీ ప్రక్రియలో చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. సత్యసాయి జిల్లాలో ఒకే వ్యక్తికి ఐదు మద్యం దుకాణాలు దక్కితే.. రెండు చోట్ల పొరుగు రాష్ట్రాల వారికి కూడా మద్యం దుకాణాలు దక్కడం విశేషం. ఇక అన్నింటికంటే ఆసక్తికరమైన సంగతి ఏంటంటే.. ఓ బ్యాచ్ 358 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసింది. రూ.7.16 కోట్లు ఖర్చు చేసి దరఖాస్తు చేస్తే.. ఎన్ని షాపులు వచ్చాయో చెప్తూ వారు చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.