AP News: అంగన్వాడీలకు గ్రాట్యుటీ.. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన

1 year ago 21
అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. అంగన్వాడీ కార్యకర్తలు నవంబర్ 16న చేపట్టిన నిరసనలపై మంత్రి సంధ్యారాణి స్పందించారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా, సానుకూలంగా ఉందని మంత్రి వెల్లడించారు. అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ చెల్లింపు విషయం పరిశీలనలో ఉందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. సమ్మె వల్ల సమస్యలు పరిష్కారం కావని.. గర్భిణులు, బాలింతలు, పిల్లలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని వివరించారు. సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఆందోళన విరమించాలని కోరారు.
Read Entire Article