ఉమ్మడి గోదావరి జిల్లావాసుల ఎదురుచూపులు ఫలించాయి. గోదావరి జిల్లాలను కలుపుతూ వశిష్ట గోదావరి నదిపై తలపెట్టిన వంతెన నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోయాయి. వంతెన నిర్మాణంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఓ రైతు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే సోమవారం రోజున సుప్రీంకోర్టు ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. దీంతో వశిష్ట గోదావరి నదిపై వంతెన నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.