పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరుతో ప్రత్యేక హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారం పారిశ్రామిక అభివృధ్ది, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీలపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలోనే రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో దీనికి ఐదు అనుబంధ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేశారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలు ఏపీ కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.