AP News: కియా కార్ల ఇంజిన్ల చోరీ కేసు అప్డేట్.. మొత్తానికి ఆ కంటైనర్లు దొరికాయి

1 year ago 26
Kia Car Factory Engines Theft Case Update: శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియాలో జరిగిన చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఇప్పటికే నిందితులను పట్టుకున్న పోలీసులు.. తాజాగా కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై పోర్టు నుంచి తయారీ యూనిట్‌కు ఇంజిన్లను తీసుకువచ్చే కంటైనర్లలో కొన్నింటిని అన్‌లోడ్ చేయుండానే అలానే ఉంచి బయటికి తరలించినట్టు గుర్తించారు. యూనిట్ నుంచి తిరిగి చెన్నైకి తీసుకుపోయి దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇంజిన్లను పంపించినట్టు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో ఆ కంటైనర్లను చెన్నైలో పోలీసులు స్వాధీనం చేసుకొని పెనుగొండ ఆర్టీసీ డిపోకు తరలించారు.
Read Entire Article